Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడుని కాల్చి చంపిన ఉగ్రవాదులు

Webdunia
ఆదివారం, 5 మే 2019 (10:21 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భారతీయ జనతా పార్టీకి చెందిన అనంతనాగ్ జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుల్ మహ్మద్ మిర్ అలియాస్ అట్టల్‌ను తీవ్రవాదులు కాల్చిచంపారు. ఈ ఘటన అనంతనాగ్ జిల్లాలో శనివారం రాత్రి 10 గంటల సమయంలో వేరినాగ్ వద్ద జరిగింది. 
 
మిలిటెంట్ల కాల్పుల కారణంగా మిర్ ఛాతీ, ఉదర భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ... అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. 
 
కాగా 60 ఏళ్ల మిర్ హత్యపై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ సోఫీ యూసఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 2008, 2014 ఎన్నికల్లో జిల్లాలోని దూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసినట్టు గుర్తుచేసుకున్నారు. కాగా మిర్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

SS Rajamouli: నా ఎక్స్పెక్ట్ కు మించి నాని చాలా ముందుకు వెళ్లిపోయాడు : ఎస్ఎస్ రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments