Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్‌లో బీజేపీకి అంత సీన్ లేదు.. చెప్పిందెవరంటే..?

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (13:35 IST)
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. వచ్చే ఏడాది జరుగనున్న ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అన్ని పార్టీలు చూస్తున్నాయి. ఇక కాషాయదళం బెంగాల్ కోటపై ప్రత్యేకమైన దృష్టిని పెట్టింది. మమత కోటలో పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. 
 
తృణమూల్ కాంగ్రస్‌కు చెందిన కీలక నేతలను ఆకర్షిస్తోంది కమలం. ఇప్పటికే తృణమూల్ కు చెందిన సుబెందు అధికారి కమలం గూటికి చేరారు. ఆయనతో పాటుగా మరో పదిమంది ఎమ్మెల్యేలు కూడా కమలం పార్టీలో చేరారు. ఎన్నికలకు ముందే తృణమూల్ నేతలు పార్టీలు మారుతుండటంతో ఆ పార్టీ ఆందోళన చెందుతోంది. 
 
తృణమూల్ కాంగ్రెస్ తరపున ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. నేతలు పార్టీ మారుతుండటంపై ప్రశాంత్ కిషోర్ స్పందించారు. బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా, ఎంత మంది నేతలను ఆకర్షించినా వచ్చే ఏడాది బెంగాల్ లో జరిగే ఎన్నికల్లో ఆ పార్టీకి పట్టుమని రెండంకెల సీట్లు కూడా గెలుచుకోలేదని అన్నారు. 
 
వచ్చే ఎన్నికల్లో మమత బెనర్జీ విజయం సాధిస్తారని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. 2014 నుంచి ప్రశాంత్ కిషోర్ అనేక పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహారిస్తున్నారు. ఈ ఏడాది బీహార్ లో జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఆర్జేడీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. కానీ, ఆర్జేడీ పరాజయం పాలైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments