Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్‌లో బీజేపీకి అంత సీన్ లేదు.. చెప్పిందెవరంటే..?

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (13:35 IST)
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. వచ్చే ఏడాది జరుగనున్న ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అన్ని పార్టీలు చూస్తున్నాయి. ఇక కాషాయదళం బెంగాల్ కోటపై ప్రత్యేకమైన దృష్టిని పెట్టింది. మమత కోటలో పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. 
 
తృణమూల్ కాంగ్రస్‌కు చెందిన కీలక నేతలను ఆకర్షిస్తోంది కమలం. ఇప్పటికే తృణమూల్ కు చెందిన సుబెందు అధికారి కమలం గూటికి చేరారు. ఆయనతో పాటుగా మరో పదిమంది ఎమ్మెల్యేలు కూడా కమలం పార్టీలో చేరారు. ఎన్నికలకు ముందే తృణమూల్ నేతలు పార్టీలు మారుతుండటంతో ఆ పార్టీ ఆందోళన చెందుతోంది. 
 
తృణమూల్ కాంగ్రెస్ తరపున ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. నేతలు పార్టీ మారుతుండటంపై ప్రశాంత్ కిషోర్ స్పందించారు. బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా, ఎంత మంది నేతలను ఆకర్షించినా వచ్చే ఏడాది బెంగాల్ లో జరిగే ఎన్నికల్లో ఆ పార్టీకి పట్టుమని రెండంకెల సీట్లు కూడా గెలుచుకోలేదని అన్నారు. 
 
వచ్చే ఎన్నికల్లో మమత బెనర్జీ విజయం సాధిస్తారని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. 2014 నుంచి ప్రశాంత్ కిషోర్ అనేక పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహారిస్తున్నారు. ఈ ఏడాది బీహార్ లో జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఆర్జేడీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. కానీ, ఆర్జేడీ పరాజయం పాలైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments