Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ఓబీసీ లేదా దళిత వర్గానికి చెందిన నేతను సీఎం చేయాలి: సాక్షి మహరాజ్

దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించిన నేపథ్యంలో.. ఆ పార్టీ నేత సాక్షి మహరాజ్ సంచలన డిమాండ్ చేశారు. ఇప్పటికే సీఎం రేసులో ఉన్నట్లు రాజ్‌నాథ్-యోగి ఆదిత్యనాథ

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (12:50 IST)
దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించిన నేపథ్యంలో.. ఆ పార్టీ నేత సాక్షి మహరాజ్ సంచలన డిమాండ్ చేశారు. ఇప్పటికే సీఎం రేసులో ఉన్నట్లు రాజ్‌నాథ్-యోగి ఆదిత్యనాథ్ పేర్లు వినబడుతుంటే.. సాక్షి మాత్రం ఓబీసీ లేదా దళిత వర్గానికి చెందిన నేతను సీఎం చేయాలని  పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో సుమారు 20-22 శాతం మంది దళితులు ఉన్నారని, ఓబీసీలు 27 శాతం ఉన్నారని, వీరికి రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించాలని కోరారు. ఫలితాలను చూసి తానో స్లోగన్ చెప్పాలనుకుంటున్నట్లు చెప్పారు. 
 
''అబ్‌కీబార్‌ 300 పార్‌" అన్న సాక్షి మహరాజ్.. ఈసారి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించేందుకు ముందుకెళ్తున్నామన్నారు. ఇంకా పూర్తి కాని మెట్రో, ఎక్స్‌ప్రెస్‌వేలను అఖిలేష్‌ యాదవ్‌ యుద్ధప్రాతిపదికన ప్రారంభించినప్పుడే ఎస్పీ ఓటమి ఖాయమని తేలిపోయింది. కాంగ్రెస్‌తో జతకట్టగానీ ఆయన ఓటమి ఖాయమని మరోమారు రూడీ అయిందని సాక్షి మహరాజ్ వ్యాఖ్యానించారు. ఈ ఫలితాల దెబ్బకు యూపీలో బలమైన ప్రతిపక్షం కూడా లేకుండా పోయిందని సాక్షి మహరాజ్ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments