Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఎంపీ ఆత్మహత్య.. అమిత్ షా సంతాపం... కీలక సమావేశం రద్దు

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (13:13 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చెందిన బీజేపీ ఎంపీ మండి రామ్ స్వరూప్ శర్మ ఢిల్లీలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి సమీపంలోని గోమతీ అపార్ట్‌మెంట్‌లో సీలింగ్ ఫ్యాన్‌కి వేలాడుతూ ఈయన మృతదేహం కనబడింది. ఈయన ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. 
 
ఓ ఉద్యోగి నుంచి తమకు ఫోన్ కాల్ అందిందని, వెళ్లి చూస్తే డోర్ లోపలి నుంచి వేసి ఉందని పోలీసులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి ప్రాంతానికి చెందిన ఈ ఎంపీ మృతిపట్ల హోం మంత్రి అమిత్ షా తన ట్విటరులో తీవ్ర సంతాపం తెలిపారు. 
 
రామ్ స్వరూప్ శర్మకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మండి జిల్లాలోని జల్ పెహర్ గ్రామంలో 1958 లో జన్మించిన ఈయన రెండు సార్లు ఎంపీగా ఉన్నారు. 
 
2014లో, ఆ తర్వాత 2019 లో ఈయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. విదేశీ వ్యవహారాలపై ఉన్న స్టాండింగ్ కమిటీలోను, ఈ శాఖ కన్సల్టేటివ్ కమిటీలో కూడా శర్మ సభ్యుడిగా ఉన్నారు. ఈయన మృతికి సంతాప సూచనగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని రద్దు చేశారు. 
 
ఈ సమావేశం గురువారం ఉదయం జరగాల్సి ఉంది. శర్మ ఎందుకు సూసైడ్ చేసుకున్నారన్న విషయం స్పష్టం కాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments