Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడ్డదిడ్డంగా రాస్తే బుఖారీకి పట్టినగతే : జర్నలిస్టులకు బీజేపీ ఎమ్మెల్యే

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని జర్నలిస్టులకు భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే లాల్ సింగ్ ఘాటు హెచ్చరిక చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో పనిచేస్తున్న జర్నలిస్టులు హద్దులు దాటకుండా వార్తా సేకరణ చేయాలని, అడ్డద

Webdunia
ఆదివారం, 24 జూన్ 2018 (11:10 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని జర్నలిస్టులకు భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే లాల్ సింగ్ ఘాటు హెచ్చరిక చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో పనిచేస్తున్న జర్నలిస్టులు హద్దులు దాటకుండా వార్తా సేకరణ చేయాలని, అడ్డదిడ్డంగా రాతలు రాస్తే, షుజ్జత్ బుఖారీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఈయన పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సర్కారులో మంత్రిగా పని చేయడం గమనార్హం.
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 'కాశ్మీర్‌లో జర్నలిస్టులు ఓ తప్పుడు వాతావరణాన్ని సృష్టించారు. మీ హద్దులు మీరే నిర్ణయించుకోవాలని నేను కోరుతున్నా. మీ గురించి మీరు ఆలోచించుకోండి. జాగ్రత్త పడండి. షుజ్జత్ బుఖారీలా జీవించాలని భావిస్తే మీ ఇష్టం' అని ఆయన వ్యాఖ్యానించారు. జర్నలిస్టులకు స్వాతంత్ర్యం, స్వేచ్ఛ ఉందని, అయితే అది జాతిని, జాతీయతా భావాన్ని ఫణంగా పెట్టేలా మాత్రం ఉండబోదని లాల్ సింగ్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments