Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రదాడిలో కాశ్మీర్ బీజేపీ నేత, భార్య మృతి.. ఖండించిన గవర్నర్

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (19:07 IST)
ఉగ్రదాడిలో కాశ్మీర్ బీజేపీ నేత, ఆయన భార్య మృతి చెందారు. సోమవారం అనంతనాగ్‌ పట్టణంలోని లాల్ చౌక్‌ వద్ద ఓ బీజేపీ సర్పంచ్​, ఆయన భార్యపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రగాయాలైన వారిని హాస్పిటల్‌కి తరలించగా.. అక్కడ వారు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
 
మృతులు కుల్గాం జిల్లా భాజపా కిసాన్​ మోర్చా అధ్యక్షుడు గులామ్ రసూల్​ దార్​, ఆయన భార్య అని ఓ పోలీస్​ అధికారి చెప్పారు. కుల్గామ్ జిల్లా​ రేద్వానీకి చెందిన గులామ్ రసూల్​ దార్​.. ఆ గ్రామ సర్పంచ్​గా పని చేస్తున్నారు. 
 
ప్రస్తుతం ఆయన అనంత్​నాగ్​లోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సర్పంచ్​ రసూల్ దార్​, ఆయన భార్యపై ఉగ్రవాదుల దాడి ఘటనను జమ్ముకశ్మీర్​ లెఫ్టినెంట్​ గవర్నర్​ ఖండించారు. ఈ పిరికిపంద చర్యకు పాల్పడినవారికి త్వరలోనే తగిన రీతిలో బుద్ధి చెబుతామని అన్నారు. మృతుల కుటుంబానికి లెఫ్టినెంట్​ గవర్నర్​ సంతాపం తెలిపారు
 
మరోవైపు, పూంచ్ సెక్టార్‌లో బీఎస్ఎఫ్ దళాలు నిర్వహించిన తనిఖీల్లో భారీ స్థాయిలో ఆయుధాలు లభ్యమయ్యాయి. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం.. బీఎస్ఎఫ్ దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. విల్ సంగద్ అటవీ ప్రాంతంలో జరిగిన గాలింపులో దొరికిన ఆయుధాల్లో ఏకే 47 రైఫిళ్లు, పిస్తోళ్లు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

Odela 2: మా నాన్నమ్మనుంచి ఓదెల 2లో నాగసాధు పాత్ర పుట్టింది : డైరెక్టర్ సంపత్ నంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments