Webdunia - Bharat's app for daily news and videos

Install App

లతా మంగేష్కర్ మృతి : బీజేపీ మేనిఫెస్టో విడుదల వాయిదా

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (16:10 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతితో ఆమెకు గౌరవ సూచకంగా ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ఈ ఎన్నికల మేనిఫెస్టో కోసం కేంద్ర హోం మంత్రి అమిత్, సీఎం యోగి, డిప్యూటీ గవర్నర్ కేశవ ప్రసాద్ మౌర్యతో పాటు పలువురు బీజేపీ నేతలు లక్నోకు చేరుకున్నారు. ఈ సమయంలోనే లతా మంగేష్కర్ మరణవార్త వారికి తెలిసింది. 
 
దీంతో మేనిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని రద్దు చేసింది. ఆమెకు గౌరవ సూచకంగా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత రెండు నిమిషాల పాటు అందరూ మౌనం పాటించారు. అదేసమయంలో మేనిఫెస్టో విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని వారు తెలిపారు. 
 
"గాన కోకిల లతా మంగేష్కర్ మృతి చెందారు. దీంతో తాము పార్టీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాం. కొన్ని రోజుల్లోనే విడుదల తేదీని ప్రకటిస్తాం" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments