Webdunia - Bharat's app for daily news and videos

Install App

లతా మంగేష్కర్ మృతి : బీజేపీ మేనిఫెస్టో విడుదల వాయిదా

Lata Mangeshkar s Death
Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (16:10 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతితో ఆమెకు గౌరవ సూచకంగా ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ఈ ఎన్నికల మేనిఫెస్టో కోసం కేంద్ర హోం మంత్రి అమిత్, సీఎం యోగి, డిప్యూటీ గవర్నర్ కేశవ ప్రసాద్ మౌర్యతో పాటు పలువురు బీజేపీ నేతలు లక్నోకు చేరుకున్నారు. ఈ సమయంలోనే లతా మంగేష్కర్ మరణవార్త వారికి తెలిసింది. 
 
దీంతో మేనిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని రద్దు చేసింది. ఆమెకు గౌరవ సూచకంగా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత రెండు నిమిషాల పాటు అందరూ మౌనం పాటించారు. అదేసమయంలో మేనిఫెస్టో విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని వారు తెలిపారు. 
 
"గాన కోకిల లతా మంగేష్కర్ మృతి చెందారు. దీంతో తాము పార్టీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాం. కొన్ని రోజుల్లోనే విడుదల తేదీని ప్రకటిస్తాం" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments