Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిపై అత్యాచారం.. అడ్డుకున్న మైనర్ బాలుడు.. కానీ కొట్టి చంపేశారు..

తల్లిపై అత్యాచారం.. అడ్డుకున్న మైనర్ బాలుడు.. కానీ కొట్టి చంపేశారు..
Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (14:12 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నా.. కఠినమైన శిక్షలను అమలు పరచడంలో విఫలమైంది. వయోబేధం లేకుండా మహిళలపై దాడులు చోటుచేసుకుంటున్న తరుణంలో, బీహార్‌ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. తల్లిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన కామాంధులకు చుక్కలు చూపించాడు.. ఓ మైనర్ బాలుడు. తల్లిపై జరగాల్సిన అకృత్యాన్ని అడ్డుకున్నాడు. కానీ ఆ కామాంధుల కోపానికి బలైపోయాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ముజఫర్ జిల్లా ధరంపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ, తన కుమారుడితో కలిసి జీవిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన రాజేంద్ర షా అనే వ్యక్తికి చెందిన దుకాణంలో పనిచేస్తూ.. ఆమె కొడుకుని పోషించుకుంటోంది. ఆ షాపు యజమాని కొడుకు పప్పు.. దుకాణంలో పనిచేసే మహిళపై కన్నేశాడు. అతని స్నేహితులతో కలిసి దుకాణం వద్దకు వచ్చి... ఆమెపై అత్యాచారానికి యత్నించాడు.
 
అయితే ఆమె కుమారుడు అతనిని అడ్డుకున్నాడు. దీంతో కోపంతో రగిలిపోయిన పప్పు.. తన స్నేహితులతో కలిసి బాలుడిని చితకబాదాడు. తీవ్రగాయాల పాలైన బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో నిందితులకు శిక్ష విధించాలని కోరుతూ.. గ్రామస్థులు బాలుడి శవంతో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments