Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడిగుడ్లు పగిలాయనీ భార్య తలను గోడకేసి బాది చంపాడు...

కోడిగుడ్లు పగిలాయనీ భార్య తలను గోడకేసి బాదిచంపిన ఘటన ఒకటి తమిళనాడు రాష్ట్రంలోని తిరుప్పూరు జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (13:04 IST)
కోడిగుడ్లు పగిలాయనీ భార్య తలను గోడకేసి బాదిచంపిన ఘటన ఒకటి తమిళనాడు రాష్ట్రంలోని తిరుప్పూరు జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జిల్లాలోని గాంగేయం సమీప కడైయూర్‌ గ్రామంలో బీహార్‌ రాష్ట్రానికి చెందిన సికిందర్‌ (25), రూనాదేవి (21) దంపతులు వలస వచ్చి జీవిస్తున్నారు. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, ఆదివారం రాత్రి ఆమ్లేట్ వేయాలని భార్యను కోరాడు. ఇందుకోసం అవసరమైన కోడి గుడ్లు కూడా కొకొనుగోలు చేసి తెచ్చి ఇచ్చాడు. 
 
అయితే, ఆ సమయానికి వంట గదిలోకి వచ్చిన కుమారుడు ఆ గుడ్లను కింద పడవేయడంతో అవి పగిలిపోయాయి. దీంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. భార్య నిర్లక్ష్యం కారణంగానే గుడ్లు పగిలాయని ఆగ్రహించిన సికిందర్‌, ఆమె తలను పట్టుకుని గోడకేసి బాదాడు. 
 
ఆమె కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని గాయపడిన రునాదేవిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మార్గం మధ్యంలో మృతిచెందింది. ఈ ఘటనపై ఇంటి యజమాని మణి ఫిర్యాదుతో గాంగేయం పోలీసులు కేసు నమోదుచేసుకొని, సికిందర్‌ను అరెస్ట్‌ చేశారు. ఇటు తల్లి మృతి చెంది, తండ్రి జైలుపాలుకావడంతో రెండున్నరేళ్ల బాలుడు అనాథగా మారాడు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments