Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడిగుడ్లు పగిలాయనీ భార్య తలను గోడకేసి బాది చంపాడు...

కోడిగుడ్లు పగిలాయనీ భార్య తలను గోడకేసి బాదిచంపిన ఘటన ఒకటి తమిళనాడు రాష్ట్రంలోని తిరుప్పూరు జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (13:04 IST)
కోడిగుడ్లు పగిలాయనీ భార్య తలను గోడకేసి బాదిచంపిన ఘటన ఒకటి తమిళనాడు రాష్ట్రంలోని తిరుప్పూరు జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జిల్లాలోని గాంగేయం సమీప కడైయూర్‌ గ్రామంలో బీహార్‌ రాష్ట్రానికి చెందిన సికిందర్‌ (25), రూనాదేవి (21) దంపతులు వలస వచ్చి జీవిస్తున్నారు. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, ఆదివారం రాత్రి ఆమ్లేట్ వేయాలని భార్యను కోరాడు. ఇందుకోసం అవసరమైన కోడి గుడ్లు కూడా కొకొనుగోలు చేసి తెచ్చి ఇచ్చాడు. 
 
అయితే, ఆ సమయానికి వంట గదిలోకి వచ్చిన కుమారుడు ఆ గుడ్లను కింద పడవేయడంతో అవి పగిలిపోయాయి. దీంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. భార్య నిర్లక్ష్యం కారణంగానే గుడ్లు పగిలాయని ఆగ్రహించిన సికిందర్‌, ఆమె తలను పట్టుకుని గోడకేసి బాదాడు. 
 
ఆమె కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని గాయపడిన రునాదేవిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మార్గం మధ్యంలో మృతిచెందింది. ఈ ఘటనపై ఇంటి యజమాని మణి ఫిర్యాదుతో గాంగేయం పోలీసులు కేసు నమోదుచేసుకొని, సికిందర్‌ను అరెస్ట్‌ చేశారు. ఇటు తల్లి మృతి చెంది, తండ్రి జైలుపాలుకావడంతో రెండున్నరేళ్ల బాలుడు అనాథగా మారాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments