Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసిన భర్త.. ఎక్కడున్నా సంతోషంగా వుండాలని..?

వరుణ్
ఆదివారం, 4 ఆగస్టు 2024 (10:33 IST)
భార్య ఇంకో వ్యక్తిని ప్రేమించినా భర్త హుందాగా నడుచుకున్నాడు. భార్యను ప్రేమించిన వ్యక్తితోనే పెళ్లి జరిపించాడు. ఈ ఘటన బీహార్‌లోని లఖిసరాయ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజేష్ కుమార్ (26) బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లా రామ్‌నగర్ గ్రామానికి చెందినవాడు. ఇతని భార్య ఖుష్బూ కుమారి (22). 2021లో వివాహం చేసుకున్న వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.
 
 ఇక ఖుష్బూ కుమారి అదే గ్రామానికి చెందిన చందన్ కుమార్ (24)తో చాలా కాలంగా ప్రేమలో ఉంది. అయితే అంతకుముందే ఖుష్బూ తల్లిదండ్రులు తమ కుమార్తెకు రాజేష్ కుమార్‌తో వివాహం జరిపించారు. కానీ ఖుష్బూ కుమారి తన పాత ప్రేమను మరిచిపోలేక బాధపడుతూ వచ్చింది.
 
ఒక రాత్రి రాజేష్ లేని సమయంలో, చందన్ కుమార్ ఖుష్బూ ఇంటికి వచ్చాడు. అప్పుడు రాజేష్ కుమార్ సోదరులు ఖుష్బూ, చందన్ కుమార్‌లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తదనంతరం, మరుసటి రోజు ఉదయం ఖుష్బూ, చందన్ కుమార్‌లను పంచాయితీకి తీసుకువచ్చారు.
 
ఈ పంచాయతీలో భాగంగా అక్కడికి వచ్చిన ఆమె భర్త రాజేష్ కుమార్.. తన భార్యను ప్రేమించిన చందన్‌తో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అనంతరం ఇరువురి అంగీకారంతో అక్కడి ఆలయంలో వివాహం జరిగింది. దీంతో రాజేష్ తన రెండేళ్ల బాలుడిని తన వద్దే ఉంచుకుని భార్యను ప్రియుడితో సంతోషంగా పంపించాడు.
 
ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ''వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగాలి. వారు ఎక్కడున్నా బాగుండాలి. నేను నా కొడుకుతో కలిసి జీవిస్తాను."అంటూ తెలిపాడు.
 
ఖుష్బూ కుమారి మాట్లాడుతూ.. "నా భర్త నన్ను ప్రేమికుడితో చూడగానే పెళ్లికి అంగీకరించాడు. ఆయనకు నా కృతజ్ఞతలు. ఇప్పుడు, నేను నా కొత్త భర్తతో సంతోషంగా జీవిస్తాను." అంటూ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments