Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాటేసిన పాము పిల్లను ముక్కలుగా కొరికి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (08:03 IST)
బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి తనను కరిచిన పామును ముక్కలు ముక్కులుగా కొరికేశాడు. ఆ తర్వాత ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన రాష్ట్రంలోని మాధోపార్ గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మాధోపూర్ గ్రామంలో 65 ఏళ్ల రామా మహతో నివసిస్తున్నాడు. శనివారం రాత్రి అతనిని ఒక పాము కాటేసింది. దీంతో కోపం పట్టలేకపోయిన ఆ వ్యక్తి... ఆ పామును వెంటాడి పట్టుకున్నాడు. దాన్ని కసితీరా కొరుకుతూ ముక్కలు చేశాడు.
 
అనంతరం చనిపోయిన పామును ఇంటి వద్ద ఉన్న చెట్టుకు వేలాడదీశాడు. దీన్ని గమనించిన గ్రామస్థులు ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని ఎంతో బతిమాలారు. అయినప్పటికీ వారి మాటను ఆయన వినలేదు. 
 
భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు. స్పృహ తప్పినట్టున్న ఆయనను తెల్లవారుజామున కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో, గ్రామంలో విషాదం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments