Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ ప్రజలు చనిపోతున్నారు.. 24 గంటల్లో 42 మంది జలసమాధి

బీహార్ రాష్ట్రంలో వర్ష, వరద బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత 24 గంటల్లో ఏకంగా 42 మంది చనిపోయారు. దీంతో బీహార్‌లో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 482కు చేరింది. అలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా వ

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2017 (21:01 IST)
బీహార్ రాష్ట్రంలో వర్ష, వరద బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత 24 గంటల్లో ఏకంగా 42 మంది చనిపోయారు. దీంతో బీహార్‌లో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 482కు చేరింది. అలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా వరద మృతుల సంఖ్య 101కు చేరింది. 
 
కాగా, గత కొన్ని రోజులుగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టిస్తున్న విషయం తెల్సిందే. ఈ రాష్ట్రంలోని 19 జిల్లాల పరిధిలోని 1.72 కోట్ల మంది ఇంకా వరదముంపులోనే ఉన్నారు. జాతీయ విపత్తు నివారణ సంస్థకు చెందిన 28 బృందాలు, 630 మంది సైనికులు వివిధ బృందాలుగా విడిపోయి పునరావాస, సహాయక చర్యలు చేపడుతున్నా...  బాధితులను పూర్తి స్థాయిలో సురక్షిత ప్రాంతాలకు తరలించలేక పోతున్నారు. 
 
బీహార్‌లోని పలు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. అటు ఉత్తరప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలు నీటిముంపులోనే ఉన్నా.. వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టింది. యూపీలో గత 24 గంటల్లో ఐదుగురు మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 101కి చేరింది. వేలాది గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments