Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ రిజల్ట్స్ : నిమిషాల వ్యవధిలో పుంజుకున్న బీజేపీ.. ఎన్డీయేదే గెలుపు

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (11:59 IST)
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిమిషాల వ్యవధిలో తారుమారయ్యాయి. మంగళవారం ఉదయం చేపట్టిన ఓట్ల లెక్కింపులో ఆర్జేడీ - కాంగ్రెస్ సారథ్యంలోని మహా కూటమి పూర్తి ఆధిక్యాన్ని కనబరిచింది. అయితే, బీజేపీ కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ ఆధిక్యాన్ని తుడిసిపెట్టేసింది. ఫలితంగా ఆధిక్యపు బలాబలాలు తారుమారయ్యాయి. 
 
ఉదయం 10 గంటల వరకూ స్పష్టమైన ఆధిక్యంలో ఉండి, సాధారణ మెజారిటీకి అవసరమైనన్ని స్థానాల్లో ఆధిక్యంలో కనిపించిన మహా ఘటబంధన్, ఆపై అనూహ్యంగా వెనక్కు పడిపోయింది. ఎన్డీయే మెజారిటీ నంబర్ 125తో పోలిస్తే 8 అధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్డీయే ప్రస్తుతం 130 చోట్ల ఆధిక్యంలో ఉండగా, మహా ఘటబంధన్ 109 చోట్ల ఆధిక్యంలో ఉంది. కింగ్ మేకర్‌గా మారతారని భావించిన చిరాగ్ నేతృత్వంలోని ఎల్జేపీ 4 స్థానాలకు, ఇతరులు 8 స్థానాలకు పరిమితం అయ్యారు.
 
ఇక, బీహార్ లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించనుంది. దాదాపు 70 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే దిశగా దూసుకెళుతున్నారు. ఆ తర్వాత ఆర్జేడీ అభ్యర్థులు 50 స్థానాల వరకూ, జేడీయూ 35 స్థానాల వరకూ, కాంగ్రెస్ 20 స్థానాల వరకూ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు గంటల్లో బీహార్ ఫలితాలపై పూర్తి స్పష్టత వెలువడుతుంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments