Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికూతురిని కిడ్నాప్ చేశారు.. తల నరికి మొండాన్నే మిగిల్చారు..!

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (13:57 IST)
పెళ్లికూతురిని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో కిడ్నాప్ చేశారు. ఆపై ఆమెను అత్యంత కిరాతకంగా తల నరికి మొండాన్ని మాత్రమే మిగిల్చారు. బీహార్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లా ద్వారక బిగాహా గ్రామానికి చెందిన ఓ 19ఏళ్ల యువతికి నీర్‌పూర్ గ్రామానికి చెందిన ఆజాద్ కుమార్ అనే యువకుడితో పెళ్లి చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. 
 
పెద్దలు కుదిర్చిన ఈ పెళ్లికిగానూ వరుడికి దాదాపు 4 లక్షల విలువైన కట్నకానుకలు ఇచ్చేందుకు యువతి తల్లిదండ్రులు అంగీకరించారు. ఇప్పటికే కొంత మొత్తాన్ని చెల్లించారు. అయితే కొద్ది రోజుల్లో పెళ్లనగా ఆ యువతి కుటుంబంలో ఊహించని ఘోరం జరిగింది. 
 
ఉన్నట్టుండి యువతిని ఎవరో కిడ్నాప్ చేశారు. తమకు ఎవరూ శత్రువులు లేరనీ, అమ్మాయికి కూడా గతంలో ఎలాంటి బెదిరింపులు రాలేదని తల్లిదండ్రులు వాపోయారు. ఆమెకు ప్రేమ వ్యవహారాలు లాంటివి కూడా లేవని చెబుతున్నారు. 
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆ యువతి మిస్సయిన మరుసటి రోజే ఓ గుర్తు తెలియని యువతి శవాన్ని కొందరు స్థానికులు గుర్తించారు. ఆ మృతదేహం కిడ్నాప్‌కు గురి అయిన యువతిదేనని పోలీసులు తేల్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments