Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికూతురిని కిడ్నాప్ చేశారు.. తల నరికి మొండాన్నే మిగిల్చారు..!

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (13:57 IST)
పెళ్లికూతురిని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో కిడ్నాప్ చేశారు. ఆపై ఆమెను అత్యంత కిరాతకంగా తల నరికి మొండాన్ని మాత్రమే మిగిల్చారు. బీహార్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లా ద్వారక బిగాహా గ్రామానికి చెందిన ఓ 19ఏళ్ల యువతికి నీర్‌పూర్ గ్రామానికి చెందిన ఆజాద్ కుమార్ అనే యువకుడితో పెళ్లి చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. 
 
పెద్దలు కుదిర్చిన ఈ పెళ్లికిగానూ వరుడికి దాదాపు 4 లక్షల విలువైన కట్నకానుకలు ఇచ్చేందుకు యువతి తల్లిదండ్రులు అంగీకరించారు. ఇప్పటికే కొంత మొత్తాన్ని చెల్లించారు. అయితే కొద్ది రోజుల్లో పెళ్లనగా ఆ యువతి కుటుంబంలో ఊహించని ఘోరం జరిగింది. 
 
ఉన్నట్టుండి యువతిని ఎవరో కిడ్నాప్ చేశారు. తమకు ఎవరూ శత్రువులు లేరనీ, అమ్మాయికి కూడా గతంలో ఎలాంటి బెదిరింపులు రాలేదని తల్లిదండ్రులు వాపోయారు. ఆమెకు ప్రేమ వ్యవహారాలు లాంటివి కూడా లేవని చెబుతున్నారు. 
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆ యువతి మిస్సయిన మరుసటి రోజే ఓ గుర్తు తెలియని యువతి శవాన్ని కొందరు స్థానికులు గుర్తించారు. ఆ మృతదేహం కిడ్నాప్‌కు గురి అయిన యువతిదేనని పోలీసులు తేల్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments