Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో విషాదం : పుణ్యస్నానానికెళితే ప్రాణాలు పోయాయి...

Webdunia
శనివారం, 10 జులై 2021 (11:38 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి సరయూ నదిలో రెండు కుటుంబాలకు చెందిన 15 మంది నీట మునిగారు. వీరిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా ముగ్గురిని అధికారులు రక్షించారు. మరో ముగ్గురు గల్లంతు కాగా.. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆగ్రా నుంచి రెండు కుటుంబాలకు చెందిన 15 మంది.. అయోధ్య పర్యటనకు వచ్చారు. సరయూ నది గుప్తార్ ఘాట్ వద్ద శుక్రవారం.. స్నానం చేసేందుకు వారంతా నీటిలో దిగారు. వారిలో ఓ మహిళ నీట మునగటంతో ఆమెను కాపాడే ప్రయత్నంలో 15 మంది నీట మునిగారు. 
 
అందులో ముగ్గురు వ్యక్తులు తమంతట తాముగా ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకున్నారు. ఆరుగు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న జిల్లా మేజిస్ట్రేట్ అనూజ్ కుమార్ ఝా, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శైలేష్ పాండే ఘటనాస్థలికి చేరుకున్నారు. 
 
ప్రాణాలతో బయటపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన వారికోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎప్, పీఏసీ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ వినయ్ కుమార్ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments