అయోధ్యలో విషాదం : పుణ్యస్నానానికెళితే ప్రాణాలు పోయాయి...

Webdunia
శనివారం, 10 జులై 2021 (11:38 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి సరయూ నదిలో రెండు కుటుంబాలకు చెందిన 15 మంది నీట మునిగారు. వీరిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా ముగ్గురిని అధికారులు రక్షించారు. మరో ముగ్గురు గల్లంతు కాగా.. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆగ్రా నుంచి రెండు కుటుంబాలకు చెందిన 15 మంది.. అయోధ్య పర్యటనకు వచ్చారు. సరయూ నది గుప్తార్ ఘాట్ వద్ద శుక్రవారం.. స్నానం చేసేందుకు వారంతా నీటిలో దిగారు. వారిలో ఓ మహిళ నీట మునగటంతో ఆమెను కాపాడే ప్రయత్నంలో 15 మంది నీట మునిగారు. 
 
అందులో ముగ్గురు వ్యక్తులు తమంతట తాముగా ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకున్నారు. ఆరుగు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న జిల్లా మేజిస్ట్రేట్ అనూజ్ కుమార్ ఝా, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శైలేష్ పాండే ఘటనాస్థలికి చేరుకున్నారు. 
 
ప్రాణాలతో బయటపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన వారికోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎప్, పీఏసీ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ వినయ్ కుమార్ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments