Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ సీఎం చాంబర్‌లో ఆసక్తికర దృశ్యం... ఆ ఇద్దరి ఫోటోలే...

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (20:10 IST)
పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ సింగ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్  సింగ్ స్వగ్రామం ఖత్కర్ కలాన్‌లో ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఆ తర్వాత నేరుగా పంజాబ్ సివిల్ సెక్రటేరియట్‌కు చేరుకున్నారు. సచివాలయంలోని సీఎం చాంబరులోకి ప్రవేశించిన ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 
 
అయితే, సీఎం చాంబర్‌లో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫోటోలతో పాటు ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోటోలు ఉంటాయి. కానీ, ఈ సంప్రదాయానికి పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి స్వస్తి పలికారు. 
 
తన చాంబరులో కేవలం స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఫోటోలను మాత్రమే ఉంచారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఆయన అప్ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కూడా తన కార్యాలయంలో కేవలం భగత్ సింగ్, అంబేద్కర్ ఫోటోలు మాత్రమే ఉంటాయని ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ ప్రకారంగానే ఆయన తన కార్యాలయంలో వీరిద్దరి ఫోటోలు మినహా మరే ఫోటోను కూడా భగవంత్ మాన్ సింగ్ అనుమతించకపోవడం గమనార్హం. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments