Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిఘాటు : బెంగుళూరు రెస్టారెంట్ల సంచలన నిర్ణయం

Webdunia
ఆదివారం, 1 డిశెంబరు 2019 (15:59 IST)
దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కిలో ఉల్లిపాయల ధర రూ.వందకు పైగా పలుకుతోంది. అనేక మెట్రో నగరాల్లో ఈ ధరలు రూ.100 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. ఈ నేపథ్యంలో బెంగుళూరులోని రెస్టారెంట్లు అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. 
 
ముఖ్యంగా, దేశంలో ఆకాశాన్నంటిన ఉల్లిధరలతో బెంబేలెత్తిపోయిన హోటల్ యాజమాన్యాలు ఉల్లి దోశను నిషేధించాయి. అంతేకాదు.. మిగతా ఆహార పదార్థాలలోనూ ఉల్లివాడకాన్ని వీలైనంత వరకూ తగ్గిస్తున్నాయి. బడా రెస్టారెంట్లు ఉల్లివాడకాన్ని తగ్గించేస్తే.. చిన్న, మధ్యస్థాయి హోటళ్లు మాత్రం ఏకంగా ఉల్లి దోశను మెనూ నుంచి తొలగించాయి. ఉల్లి ధరల ఘాటును పెద్ద హోటళ్లు ఎలాగోలా తట్టుకుంటున్నప్పటికీ.. చిన్న హోటళ్లు మాత్రం లబోదిబోమంటున్నాయి.
 
రేటు పెంచితే కస్టమర్లు దూరమయ్యే పరిస్థితి.. రేటు పెంచకపోతే నష్టాల్లోకి కూరకుపోయ్యే ప్రమాదం.. దీంతో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా చిన్న మధ్యస్థాయి హోటళ్ల పరిస్థితి తయారైంది. దోశను బ్యాన్ చేయడంతో పాటు ఉల్లి వాడకాన్ని తగ్గించడమే వారికి సరైన మార్గంగా తోచింది. లాభనష్టాల విషయం అలావుంచితే.. వినియోగదారుల ఈ నిర్ణయంతో షాకైపోతున్నారు. ఉల్లి వాడకం తగ్గటంతో ఆహార పదార్థాల్లో మునుపటి రుచి కనిపించడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments