ఉల్లిఘాటు : బెంగుళూరు రెస్టారెంట్ల సంచలన నిర్ణయం

Webdunia
ఆదివారం, 1 డిశెంబరు 2019 (15:59 IST)
దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కిలో ఉల్లిపాయల ధర రూ.వందకు పైగా పలుకుతోంది. అనేక మెట్రో నగరాల్లో ఈ ధరలు రూ.100 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. ఈ నేపథ్యంలో బెంగుళూరులోని రెస్టారెంట్లు అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. 
 
ముఖ్యంగా, దేశంలో ఆకాశాన్నంటిన ఉల్లిధరలతో బెంబేలెత్తిపోయిన హోటల్ యాజమాన్యాలు ఉల్లి దోశను నిషేధించాయి. అంతేకాదు.. మిగతా ఆహార పదార్థాలలోనూ ఉల్లివాడకాన్ని వీలైనంత వరకూ తగ్గిస్తున్నాయి. బడా రెస్టారెంట్లు ఉల్లివాడకాన్ని తగ్గించేస్తే.. చిన్న, మధ్యస్థాయి హోటళ్లు మాత్రం ఏకంగా ఉల్లి దోశను మెనూ నుంచి తొలగించాయి. ఉల్లి ధరల ఘాటును పెద్ద హోటళ్లు ఎలాగోలా తట్టుకుంటున్నప్పటికీ.. చిన్న హోటళ్లు మాత్రం లబోదిబోమంటున్నాయి.
 
రేటు పెంచితే కస్టమర్లు దూరమయ్యే పరిస్థితి.. రేటు పెంచకపోతే నష్టాల్లోకి కూరకుపోయ్యే ప్రమాదం.. దీంతో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా చిన్న మధ్యస్థాయి హోటళ్ల పరిస్థితి తయారైంది. దోశను బ్యాన్ చేయడంతో పాటు ఉల్లి వాడకాన్ని తగ్గించడమే వారికి సరైన మార్గంగా తోచింది. లాభనష్టాల విషయం అలావుంచితే.. వినియోగదారుల ఈ నిర్ణయంతో షాకైపోతున్నారు. ఉల్లి వాడకం తగ్గటంతో ఆహార పదార్థాల్లో మునుపటి రుచి కనిపించడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments