Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిఘాటు : బెంగుళూరు రెస్టారెంట్ల సంచలన నిర్ణయం

Webdunia
ఆదివారం, 1 డిశెంబరు 2019 (15:59 IST)
దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కిలో ఉల్లిపాయల ధర రూ.వందకు పైగా పలుకుతోంది. అనేక మెట్రో నగరాల్లో ఈ ధరలు రూ.100 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. ఈ నేపథ్యంలో బెంగుళూరులోని రెస్టారెంట్లు అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. 
 
ముఖ్యంగా, దేశంలో ఆకాశాన్నంటిన ఉల్లిధరలతో బెంబేలెత్తిపోయిన హోటల్ యాజమాన్యాలు ఉల్లి దోశను నిషేధించాయి. అంతేకాదు.. మిగతా ఆహార పదార్థాలలోనూ ఉల్లివాడకాన్ని వీలైనంత వరకూ తగ్గిస్తున్నాయి. బడా రెస్టారెంట్లు ఉల్లివాడకాన్ని తగ్గించేస్తే.. చిన్న, మధ్యస్థాయి హోటళ్లు మాత్రం ఏకంగా ఉల్లి దోశను మెనూ నుంచి తొలగించాయి. ఉల్లి ధరల ఘాటును పెద్ద హోటళ్లు ఎలాగోలా తట్టుకుంటున్నప్పటికీ.. చిన్న హోటళ్లు మాత్రం లబోదిబోమంటున్నాయి.
 
రేటు పెంచితే కస్టమర్లు దూరమయ్యే పరిస్థితి.. రేటు పెంచకపోతే నష్టాల్లోకి కూరకుపోయ్యే ప్రమాదం.. దీంతో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా చిన్న మధ్యస్థాయి హోటళ్ల పరిస్థితి తయారైంది. దోశను బ్యాన్ చేయడంతో పాటు ఉల్లి వాడకాన్ని తగ్గించడమే వారికి సరైన మార్గంగా తోచింది. లాభనష్టాల విషయం అలావుంచితే.. వినియోగదారుల ఈ నిర్ణయంతో షాకైపోతున్నారు. ఉల్లి వాడకం తగ్గటంతో ఆహార పదార్థాల్లో మునుపటి రుచి కనిపించడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments