Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరు.. భవనం కూలింది.. అబ్దుల్ కలాం బంధువులను కాపాడారు.. (video)

సెల్వి
బుధవారం, 23 అక్టోబరు 2024 (07:45 IST)
Bengaluru rains
బెంగళూరు నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంగళవారం నగరంలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. సుమారు 17 మంది నిర్మాణ కార్మికులు శిథిలాల లోపల చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక మరియు అత్యవసర సేవల సిబ్బంది సంఘటనా స్థలం నుండి మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
 
మరో ముగ్గురిని రక్షించారు. ఇతరుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పోలీసు శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గాయపడిన భవన నిర్మాణ కార్మికుల్లో ఒకరు శిథిలాల నుంచి బయటకు వచ్చి విషాదం గురించి తెలియజేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఘటనకు సంబంధించిన సహాయక చర్యల ఆరా తీశారు. 
 
మరోవైపు, భారీ వర్షాలతో జలమయమైన కేంద్రీయ విహార్ అపార్ట్‌మెంట్‌లో నివసించిన మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం బంధువులను అధికారులు సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు వర్గాలు ధృవీకరించాయి. దివంగత కలాం బంధువులు, 80 ఏళ్ల బంధువు, ఆమె కుమార్తె అపార్ట్‌మెంట్‌లోని డి6 బ్లాక్‌లో నివసించారు. 
 
అధికారులు వేలాది మంది నివాసితులను వారి ఫ్లాట్ల నుండి పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధికారుల ఆదేశాల మేరకు వందలాది కుటుంబాలు అపార్ట్‌మెంట్‌ నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయాయి. కేంద్రీయ విహార్ అపార్ట్‌మెంట్ ముంపునకు గురై సరస్సును తలపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments