Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరులో విదేశీయుల ఇళ్ళలో సీసీబీ మెరుపు సోదాలు

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (13:41 IST)
దేశ ఐటీ రాజధానిగా ఉన్న బెంగుళూరులో విదేశీయులు నివసించే గృహాల్లో సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మెరుపు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 38 మంది వీసా గడువు ముగిసినప్పటికీ ఇంకా నగరంలోనే తిష్టవేసినట్లు గుర్తించారు. 
 
ఈ సోదాలపై సీసీబీ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ మీడియాతో మాట్లాడుతూ ఈస్ట్‌ విభాగంలో ఆరుగురు ఏసీపీలు, 20 మంది ఇన్‌స్పెక్టర్లు, 100 మందికి పైగా పోలీసులు ఈ సోదాల్లో పాల్గొన్నారని చెప్పారు. 
 
ముఖ్యంగా, ఆఫ్రికా దేశాలకు చెందిన వారు మాదకద్రవ్యాల విక్రయాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ దాడులు నిర్వహించామన్నారు. కాగా దాడుల సందర్భంగా కొందరి నివాసాల్లో గంజాయి తదితర మాదకద్రవ్యాలు లభించాయని వీరిపై ఎన్‌డీపీఎస్ చట్టాల క్రింద కేసులను నమోదు చేసినట్టు తెలిపారు.
 
మరోవైపు, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలో ఉంటున్న వారి వివరాలను కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకెళతామన్నారు. ఒక వేళ కేంద్రం సిఫార్సు చేస్తే వీసా అవధిని పొడిగించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. 
 
వీసా గడువు ముగిసిన వెంటనే విదేశీయులు నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో తెలియజేయాల్సి ఉంటుందని, అయితేఈ నియమాన్ని పాటించడం లేదన్నారు. నగర వ్యాప్తంగా అన్ని విభాగాల్లోనూ విదేశీయుల నివాసాలపై కన్నేసి ఉంచామని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments