Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్ట్ బెంగాల్‌లో ఎన్నికల తర్వాత హింస : సీబీఐకు విచారణ

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (12:42 IST)
ప‌శ్చిమ బెంగాల్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత హింస చెలరేగింది. ఈ హింసకు సంబంధించిన విచార‌ణ‌ను గురువారం హైకోర్టు సీబీఐకి అప్ప‌గించింది. సీబీఐతోపాటు కోర్టు ఆధ్వ‌ర్యంలోని స్పెష‌ల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ కూడా ఈ కేసును ప‌ర్య‌వేక్షించ‌నుంది. 
 
తాత్కాలిక చీఫ్ జ‌స్టిస్ రాజేష్ బిందాల్ నేతృత్వంలోని ఐదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం ఈ పిటిష‌న్ల‌పై విచార‌ణ జ‌రిపింది. ఈ ఏడాది మే 2న తృణ‌మూల్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో తీవ్ర హింస చెల‌రేగింది. దీనిపై ఎంతో మంది పిటిష‌న‌ర్లు హైకోర్టు గ‌డ‌ప తొక్కారు. 
 
దీంతో హైకోర్టు ఆదేశాల మేర‌కు జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ కూడా ఓ క‌మిటీ ఏర్పాటు చేసి దీనిపై విచార‌ణ జ‌రిపింది. జులై 15న దీనికి సంబంధించిన తుది నివేదిక‌ను కోర్టుకు స‌మ‌ర్పించింది. 
 
అధికార పార్టీ మ‌ద్ద‌తుదారులు ప్ర‌తిప‌క్ష పార్టీ మ‌ద్ద‌తుదారుల‌పై జ‌రిపిన ప్ర‌తీకార హింస‌గా దీనిని క‌మిటీ అభివ‌ర్ణించింది. హ‌త్య‌, అత్యాచారం వంటి తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఉన్న నేప‌థ్యంలో కేసు విచార‌ణ‌ను సీబీఐకి అప్ప‌గించాల‌ని, అంతేకాదు ఈ విచార‌ణ రాష్ట్రం బ‌య‌ట జ‌ర‌గాల‌ని కూడా స్ప‌ష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments