Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్పదోషం.. ఐదుసార్లు తాళికట్టుకోవాలి.. ఐదుసార్లు శోభనం..

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (10:25 IST)
టెక్నాలజీ పెరిగినా మూఢనమ్మకాలు ఏమాత్రం తగ్గడం లేదు. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వచ్చినా.. దొంగ బాబాల వెనుక పరుగులు తీసే జనం అధికమవుతూ వున్నారు. తాజాగా ఓ దొంగబాబా చేతికి ఓ మహిళ చిక్కుకుంది. 
 
సర్పదోషం వుందని పూజ చేయాలని ఐదుసార్లు తాళి కట్టించుకుని, ఐదుసార్లు శోభనంలో పాల్గొనాలని నమ్మించిన బాబా బాగోతం బయటపడింది. సర్పదోషం పేరిట మహిళను లోబరుచుకోవాలనుకున్న ఈ ఇద్దరు బాబాలను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని బనశంకరిలో నివాసం ఉండే ఓ మహిళ బాణసవాడిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. గొడవల కారణంగా భర్తతో విడిపోయిన ఆమెకు సర్పదోషం ఉందని ఇటీవల ఎవరో చెప్పారు. 
 
దాంతో సర్పదోష నివారణ కోసం పరిచయస్తుడైన జగన్నాథ్‌ను సంప్రదించింది. కామస్వామి గణేష్, మణికంఠ అనే ఇద్దరు స్వాములను జగన్నాథ్ పరిచయం చేశాడు. వీరిద్దరు తండ్రీకొడుకులు సర్ప దోష నివారణకు పూజ చేయాలని చెప్పి రూ.40వేలు వసూలు చేశారు.
 
పూజ అనంతరం మరో ప్రక్రియ ఉందని చెప్పి.. తమతో ఐదుసార్లు తాళి కట్టించుకుని, ఐదుసార్లు శోభనంలో పాల్గొనాలని నమ్మించారు. ఇందుకోసం ఓ హోటల్‌లో గదులు కూడా బుక్ చేశారు. ఇంతలోనే విషయం బాధితురాలి కుటుంబ సభ్యులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments