Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైక్ కొనిస్తామని నమ్మించి సామూహిక అత్యాచారం

బెంగుళూరులో ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. ముగ్గురు యువకులు ఓ యువతికి మాయమాటలు చెప్పి.. బైక్ తీసిస్తామని నమ్మించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (10:43 IST)
బెంగుళూరులో ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. ముగ్గురు యువకులు ఓ యువతికి మాయమాటలు చెప్పి.. బైక్ తీసిస్తామని నమ్మించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
బెంగుళూరు మహాలక్ష్మీలేఔట్‌కు చెందిన ఓ యువతికి ముగ్గురు యువకులు ఆరు నెలల క్రితం పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆమెకు బైక్ కొనిస్తాని ఆశచూపించారు. అలా.. వారి మాటలు నమ్మి వెంట వెళ్లింది. ఆమెను మండ్య, తుమకూరు ప్రాంతాల్లో ఆమెను తిప్పుకొని చివరికి అదునుచూసి అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
చివరకు తాను మోసపోయానని తెలుసుకోవడానికి ఆమెకు ఎంతోసేపు పట్టలేదు. ఆపై సమాజానికి భయపడి నోరు మెదపకుండా మిన్నకుండిపోయింది. ఈ క్రమంలోనే ఇటీవల దుండగుల్ని ఓ దొంగతనం కేసులో పోలీసులు అరెస్టు చేసి విచారించారు. 'విచారణ దెబ్బ'కు సామూహిక అత్యాచారం నేరాన్నీ అంగీకరించారు. 
 
ఈ సామూహిక అత్యాచారానికి పాల్పడింది మహాలక్ష్మీ లేఔట్‌‌కు చెందిన భరత్‌, ప్రమోద్‌, హరీష్‌లుగా గుర్తించి అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. బాధితురాలిని విచారిస్తే.. పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తేలింది. శుక్రవారం ఆమెను వైద్య పరీక్షల కోసం వైద్యాలయంలో చేర్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments