Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకున్న టెక్కీ భర్త

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (12:56 IST)
భార్య వేధింపులు తాళలేని ఓ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడం గమనార్హం. ఈఘటన దేశ ఐటీ రాజధాని బెంగుళూరులో జరిగింది. శ్రీనాథ్ (39) అనే టెక్కీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా బెంగళూరులోని ఓ కంపెనీలో పనిచేస్తూ అక్కడే స్థిరనివాసం ఏర్పర్చుకున్నాడు. ఈయన పలు బ్యాంకుల్లో అప్పుచేసి ఓ సొంత ఫ్లాట్ కూడా కొనుక్కున్నాడు. అదేక్రంలో ఓ యువతిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు.
 
ఆ తర్వాత నుంచి అతనికి కష్టాలు ప్రారంభమయ్యాయి. భార్య నిత్యం చేస్తున్న దుబారా ఖర్చులు, వేధింపులు అతనికి మానసిక స్థిమితం లేకుండా చేశాయి. పైగా ఇంటిని తన తండ్రి పేరున మార్చాలంటూ భార్య నుంచి నిత్యం ఒత్తిడి చేయసాగింది. 
 
ఈ వేధింపులతో ఆ టెక్కీ విసిగిపోయాడు. తాను తనువు చాలిస్తేగాని తన విలువేమిటో ఆమెకు తెలిసిరాదనుకున్నాడేమో. ఇంట్లోనే ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలిని సందర్శించి ప్రాథమిక ఆధారాల మేరకు భార్య, ఆమె తల్లిదండ్రులపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

Ye Maaya Chesave: ఏ మాయ చేసావే రీ-రిలీజ్: ప్రమోషన్ కోసం చైతూ- సమంత కలిసి కనిపిస్తారా?

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments