Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకున్న టెక్కీ భర్త

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (12:56 IST)
భార్య వేధింపులు తాళలేని ఓ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడం గమనార్హం. ఈఘటన దేశ ఐటీ రాజధాని బెంగుళూరులో జరిగింది. శ్రీనాథ్ (39) అనే టెక్కీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా బెంగళూరులోని ఓ కంపెనీలో పనిచేస్తూ అక్కడే స్థిరనివాసం ఏర్పర్చుకున్నాడు. ఈయన పలు బ్యాంకుల్లో అప్పుచేసి ఓ సొంత ఫ్లాట్ కూడా కొనుక్కున్నాడు. అదేక్రంలో ఓ యువతిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు.
 
ఆ తర్వాత నుంచి అతనికి కష్టాలు ప్రారంభమయ్యాయి. భార్య నిత్యం చేస్తున్న దుబారా ఖర్చులు, వేధింపులు అతనికి మానసిక స్థిమితం లేకుండా చేశాయి. పైగా ఇంటిని తన తండ్రి పేరున మార్చాలంటూ భార్య నుంచి నిత్యం ఒత్తిడి చేయసాగింది. 
 
ఈ వేధింపులతో ఆ టెక్కీ విసిగిపోయాడు. తాను తనువు చాలిస్తేగాని తన విలువేమిటో ఆమెకు తెలిసిరాదనుకున్నాడేమో. ఇంట్లోనే ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలిని సందర్శించి ప్రాథమిక ఆధారాల మేరకు భార్య, ఆమె తల్లిదండ్రులపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments