Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటు వేయకుంటే జీతం కట్... ఎవరికి?

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (07:38 IST)
టెక్కీలకు ఐటీ కంపెనీలు తేరుకోలేని షాకిచ్చింది. ఓటు హక్కును వినియోగించుకోని పక్షంలో ఒక రోజు వేతనం కట్ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశాయి. ఈ తరహా వార్నింగ్ కర్ణాటక రాష్ట్రంలోని అన్ని ఐటీ కంపెనీలు జారీచేశాయి. 
 
ఎన్నికల సంఘం ఆదేశం మేరకు పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవును ఆ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే, ఐటీ కంపెనీలు మాత్రం ఈ ఆదేశాలను బేఖాతర్ చేసి కొన్ని షరతులు కూడా విధించాయి. ఓటు వేసినట్టు ఖచ్చితంగా ఆధారం చూపించాల్సిందేనని, హెచ్‌ఆర్ విభాగంలో ఓటు వేసినట్టు రుజువు చూపిస్తేనే ఆ రోజున వేతనంతో కూడిన సెలవు మంజూరవుతుందని, లేదంటే వేతనంలో కోత తప్పదని హెచ్చరించాయి.
 
కంపెనీల హెచ్చరికలతో ఉద్యోగులు తలలుపట్టుకుంటున్నారు. గురువారం పోలింగ్ సెలవు, రెండు వీకెండ్ హాలిడేస్ కలుపుకుంటే వరుసగా మూడు రోజులపాటు సెలవులు ఎంజాయ్ చేయాలనుకున్న ఉద్యోగులు కంపెనీల ఉత్తర్వులతో షాక్‌కు గురయ్యారు. 
 
ఇక, ఐటీ సంస్థలు హెచ్చరికలు నిజమైన ఉద్యోగులు అందరూ ఓటింగ్‌లో పాల్గొంటే బెంగళూరులో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 10 లక్షల ఓట్లు అధికంగా పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేసేందుకు సహకరించాలంటూ ఎన్నికల సంఘం చేసిన సూచన మేరకు ప్రముఖ ఐటీ కంపెనీలు ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments