Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెప్పుకోలేని విధంగా తండ్రి వేధింపులు ... ఫ్రెండ్స్‌తో కలిసి మట్టుబెట్టిన కూతురు

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (19:33 IST)
ఓ అబల తన స్నేహితులతో కలిసి కన్నతండ్రిని మట్టుబెట్టింది. బయటకు చెప్పుకోలేని విధంగా కన్నతండ్రి వేధించడాన్ని జీర్ణించుకోలేక పోయింది. దీంతో తన స్నేహితులతో కలిసి మట్టుబెట్టుంది. ఈ ఘటన కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్‌కు చెందిన దీపక్ కుమార్ సింగ్ (46) అనే వ్యక్తి బెంగుళూరులోని గాంధీ కృషి విజ్ఞాన కేంద్రంలో భద్రతా విభాగంలో పని చేస్తున్నాడు. భార్య చనిపోవడంతో తన ముగ్గురు కుమార్తెలతో కలిసి జీవిస్తున్నాడు. 
 
వీరిలో 17 యేళ్ళ కుమార్తె ఒకరు. ఆమెను నిత్యం వేధించసాగాడు. పైగా, ఆ యువతి బయటకు చెప్పుకోలేని విధంగా చిత్రహింసలు గురిచేయసాగాడు. ఈ వేధింపులను తట్టుకోలేని ఆ యువతి.. తండ్రిపై కక్ష పెంచుకుంది. ఈ వేధింపుల నుంచి విముక్తి పొందాలంటే ఆయన్ను లేకుండా చేయడమే ఉత్తమన్న నిర్ణయానికి వచ్చింది. 
 
ఆ ఆలోచన వచ్చిందే తడవుగా తన స్నేహితలను సంప్రదించింది. ఆదివారం అర్థరాత్రి తన నలుగురు స్నేహితులను ఇంటికి పిలిచింది. వారంతా కలిసి దీపక్ సింగ్‌పై మారణాయుధాలతో దాడిచేశారు. ఈ దాడి సమయంలో ఆ యువతి ఇద్దరి చెల్లెళ్లు కూడా అక్కడే ఉండటం గమనార్హం. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... పరారీలో ఉన్న యువతితో పాటు మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments