Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలపాకట్టి బిర్యానీలో రక్తపు మరకతో కూడిన బ్యాండేజ్..

Webdunia
మంగళవారం, 28 మే 2019 (18:22 IST)
హైదరాబాద్ బిర్యానీకి మస్తు ఫేమస్. అలాగే తమిళనాడులో తలపాకట్టు అంటే భలే పాపులర్. అయితే అలాంటి సంప్రదాయ తలపాకట్టు హోటల్‌లో కస్టమర్లకు షాకిచ్చే ఘటన చోటుచేసుకుంది. గతంలో ఏదో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ చేస్తే అందులో రక్తపు మరకతో కూడి బ్యాండేజ్ కనిపించింది. ప్రస్తుతం అదే సీన్ తలపాకట్టు బిర్యానీలో రిపీట్ అయ్యింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఈరోడుకి చెందిన ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి కరూర్ బస్టాండుకు సమీపంలోని తలపాకట్టి బిర్యానీ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడి  బిర్యానీ ఆర్డర్ చేశాడు. బిర్యానీ ప్లేటు కూడా వచ్చేసింది. అయితే అక్కడే షాక్ ఎదురైంది. రక్తపు మరకతో కూడిన బ్యాండేజ్.. బిర్యానీలో కనిపించింది. దీని గురించి బిర్యానీ సెంటర్‌లో వున్న వారి వద్ద ఫిర్యాదు చేస్తే వారు ఏమాత్రం పట్టించుకోలేదు. 
 
వెంటనే ఆ వ్యక్తి ఫుడ్ కార్పొరేషన్ ఆఫీసుకెళ్లి ఫిర్యాదు చేశాడు. ఇంకా బిర్యానీలో వున్న బ్యాండేజ్‌ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ సెంటర్లో ఫుడ్ కార్పొరేషన్ అధికారులు రైడ్ నిర్వహించారు.
 
ఆ రైడ్‌లో బిర్యానీలో నాణ్యత కొరవడకపోయినా.. బిర్యానీలో బ్యాండేజ్ ఎలా వచ్చిందనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు. ఆ హోటల్‌లో కస్టమర్లకు అందించే బిర్యానీ దిండుక్కల్‌లో తయారీ చేయబడుతోందని.. అక్కడ విచారణ జరిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments