Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారుతీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. 3 వేలమంది ఉద్యోగాలు ఫట్

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (20:15 IST)
తమ కంపెనీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది మారుతీ సుజుకీ. ఇటీవల కాలంలో కార్ల సేల్స్ తగ్గడంతో సంస్థ ఢీలా పడింది. ఈ క్రమంలోనే మారుతీ కార్ల తయారీ సంస్థలో పని చేసే 3 వేల మంది ఉద్యోగులను తొలగించింది.

ఆటోమొబైల్ రంగంలో మారుతీ కార్ల డిమాండ్ తగ్గడంతోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని సంస్థ చైర్మన్ RC భార్గవ తెలిపారు. లాస్ నడిచినప్పుడు ఏ సంస్థనైనా ఉద్యోగులను తీసేయడం  బిజినెస్‌లో కామన్ అన్నారు. డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు మరింతమంది కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవడం, డిమాండ్‌ పడిపోయినప్పుడు తగ్గించుకోవడం జరుగుతుందని చెప్పారు.
 
అయితే, పర్మనెంట్‌ ఉద్యోగులపై మాత్రం ప్రభావమేమీ పడలేదన్నారు. కొంతకాలంగా మారుతీ కార్ల సేల్స్ దారుణంగా పడిపోతున్నాయని.. దీంతో ఆటోమొబైల్‌ పరిశ్రమలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయన్నారు. డిమాండ్‌ లేకపోవడం, నిల్వలు పెరిగిపోవడంతో కొన్ని సంస్థలు ఉత్పత్తిని నిలిపివేశాయని చెప్పారు.
 
ప్రభుత్వం కూడా సానుకూల చర్యలేమైనా ప్రకటిస్తే.. ఆటోమొబైల్‌ రంగంలో పరిస్థితులు మెరుగుపడటానికి ఉపయోగకరంగా ఉండగలవన్నారు భార్గవ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments