Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైద్రాబాద్ లో పార్థీ గ్యాంగ్ అరెస్ట్

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (20:13 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పార్ధి గ్యాంగ్ ను శనివారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ లో ఆరుగురు సభ్యులున్నారు. నిందితుల నుండి  రూ.22 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నారు.
 
గత నెల 26వ తేదీన హైద్రాబాద్ తార్నాకలో సతీష్ రెడ్డి ఇంట్లో దొంగతనాన్ని పోలీసులు చేధించారు. ఈ దొంగతనానికి  సంబంధించిన వివరాలను హైద్రాబాద్ రేంజ్ సీపీ అంజనీ కుమార్ మీడియాకు వివరించారు.
 
ఆరుగురు వ్యక్తులు దొంగతనానికి పాల్పడితే వారిలో మనీషా డిస్కో, అలీ రాజా ఖాన్, రూపా బాయ్ లను అరెస్ట్ చేసినట్టుగా సీపీ చెప్పారు. ఈ గ్యాంగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 2004 నుండి దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా ఆయన తెలిపారు. 
 
నిందితుల నుండి  రూ. 22 లక్షల విలువైన 60 తులాల బంగారం, రెండు కిలోల వెండిని స్వాధీనం చేసుకొన్నట్టుగా సీపీ చెప్పారు.హైద్రాబాద్, సైబరాబాద్, వరంగల్, రేణిగుంట పోలీస్ స్టేషన్లలో ఈ గ్యాంగ్ ‌పై దాదాపుగా 12 కేసులున్నాయి. 
 
మధ్యప్రదేశ్ నుండి హైద్రాబాద్ కు వచ్చి నిందితులు దొంగతనానికి పాల్పడేవారు.   కారులో వచ్చి దొంగతనం చేసి తిరిగి మధ్యప్రదేశ్ కు పారిపోయేవారని పోలీసులు చెప్పారు.ఈ గ్యాంగ్ లో మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా సీపీ అంజనీకుమార్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments