Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2020 (09:18 IST)
ఇండిగో విమానంలో ఓ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విమానం ఢిల్లీ నుంచి బెంగుళూరుకు వెళుతుండగా ఆమె ప్రసవించింది. ఇండిగో విమానం 6ఈ 122 అనే విమానం బుధవారం సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఈ విమానం బయలుదేరిన కొద్దిసేపటికో ఆ మహిళకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో విమాన సిబ్బంది ప్రత్యేక సేవలను అందించగా, 6.10 గంటల సమయంలో బిడ్డను ప్రసవించింది. అదీ నెలలు నిండకుండానే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇండిగో ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. 
 
కాగా, తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. ఈ విషయాన్ని వెల్లడించిన విమాన కెప్టెన్ క్రిష్టోఫర్, తన విమానంలో ఓ మహిళ, బిడ్డకు జన్మనివ్వడం గర్వంగా ఉందని, వారిద్దరూ క్షేమమేనని ట్వీట్ చేశారు. విమానం 7.30 గంటల సమయంలో బెంగళూరులో ల్యాండ్ కాగానే, తల్లీ బిడ్డలను ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments