Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. 12 రోజుల్లో ఇది మూడోసారి

సెల్వి
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (19:34 IST)
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బీటెక్ విద్యార్థి కోటాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత 12 రోజుల్లో కోటాలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఇది మూడోసారి. మృతుడు విజ్ఞాన్ నగర్ పోలీస్ స్టేషన్‌లోని పీజీలో నివాసం ఉంటున్న 27 ఏళ్ల నూర్ మహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. 
 
నూర్ పీజీలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించకపోవడంతో ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
 
యూపీలోని గోండా జిల్లా వీర్‌పూర్‌కు చెందిన నూర్‌ మహ్మద్‌ స్వస్థలమని విజ్ఞాన్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో కౌశల్య తెలిపారు. పీజీ నిర్వాహకుడి సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

విద్యార్థి మెస్ నుంచి టిఫిన్ ఆర్డర్ చేసేవాడు. జనవరి 31న, మెస్‌ వ్యక్తి టిఫిన్‌ను గది బయటే ఉంచాడు. మరుసటి రోజు వరకు అది తినలేదు. తలుపు తట్టినా నూర్ తెరవకపోవడంతో పీజీ ఆపరేటర్‌కు ఫోన్ చేశాడు. ఆపరేటర్ కిటికీలోంచి చూడగా విద్యార్థి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు.
 
విద్యార్థి 2016 నుంచి కోటాలో ఉంటున్నాడని, ఇక్కడే కోచింగ్‌ చేశాడని, ప్రస్తుతం బీటెక్‌కు ఎంపికై చెన్నైలోని కాలేజీలో అడ్మిషన్‌ రావడంతో ఏ కోచింగ్‌ సెంటర్‌లో చేరలేదని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. కోటాలో ఉంటూ ఆన్‌లైన్ క్లాసులు తీసుకుంటున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments