Webdunia - Bharat's app for daily news and videos

Install App

370 అధికరణపై సుప్రీంకోర్టులో విచారణ.. ఆజాద్‌కు ఊరట కలిగేనా?

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (11:08 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ఆర్టికల్ రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై సోమవారం చర్చ జరుగనుంది. 
 
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గంగోయ్‌ నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దాఖలు చేసిన పిటిషన్‌ సహా ఇదే అంశంపై దాఖలైన పలు పిటిషన్‌లను విచారణకు చేపట్టనుంది. 
 
తమ సహచర నేత, చట్టసభ సభ్యుడు మహ్మద్‌ యూసుఫ్‌ తరిగామి నిర్బంధాన్ని సవాల్‌ చేస్తూ ఏచూరి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అలాగే, తాను వ్యక్తిగత హోదాలో ఈ పిటిషన్‌ దాఖలు చేశానని గులాం నబీ ఆజాద్‌ పేర్కొన్నారు. 
 
తన కుటుంబ సభ్యులతో పాటు జమ్ము కాశ్మీర్‌ ప్రజల బాగోగులను తాను తెలుసుకోగోరుతున్నానని ఆయన అందులో పేర్కొన్నారు. తాను మానవతా దృక్పథంతోనే పిటిషన్‌ దాఖలు చేశానని, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని ఆజాద్‌ వివరించారు. ఈ పిటిషన్ల‌న్నింటిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

వార్ 2 కథను రూపొందించటానికి చాలా సమయం పట్టింది - అయాన్ ముఖర్జీ

కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)

Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments