Webdunia - Bharat's app for daily news and videos

Install App

370 అధికరణపై సుప్రీంకోర్టులో విచారణ.. ఆజాద్‌కు ఊరట కలిగేనా?

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (11:08 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ఆర్టికల్ రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై సోమవారం చర్చ జరుగనుంది. 
 
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గంగోయ్‌ నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దాఖలు చేసిన పిటిషన్‌ సహా ఇదే అంశంపై దాఖలైన పలు పిటిషన్‌లను విచారణకు చేపట్టనుంది. 
 
తమ సహచర నేత, చట్టసభ సభ్యుడు మహ్మద్‌ యూసుఫ్‌ తరిగామి నిర్బంధాన్ని సవాల్‌ చేస్తూ ఏచూరి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అలాగే, తాను వ్యక్తిగత హోదాలో ఈ పిటిషన్‌ దాఖలు చేశానని గులాం నబీ ఆజాద్‌ పేర్కొన్నారు. 
 
తన కుటుంబ సభ్యులతో పాటు జమ్ము కాశ్మీర్‌ ప్రజల బాగోగులను తాను తెలుసుకోగోరుతున్నానని ఆయన అందులో పేర్కొన్నారు. తాను మానవతా దృక్పథంతోనే పిటిషన్‌ దాఖలు చేశానని, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని ఆజాద్‌ వివరించారు. ఈ పిటిషన్ల‌న్నింటిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments