అయోధ్య వేడుకలకు ఎల్కే.అద్వానీ దూరం.. ఎందుకో తెలుసా?

వరుణ్
సోమవారం, 22 జనవరి 2024 (12:20 IST)
అయోధ్య రామ మందిర నిర్మాణానికి పునాది వేసిన భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు ఎల్కే.అద్వానీ సోమవారం ప్రతిష్టాత్మకంగా సాగుతున్న రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. దీన్ని ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే, బీజేపీ శ్రేణులు మాత్రం అనారోగ్య కారణాల వల్లే ఆయన ఈ మహా కార్యానికి దూరంగా ఉంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. మరో బీజేపీ అగ్రనేత మురళీ మనోహర్ జోషి కూడా హాజరుకావడం లేదు. ఢిల్లీలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అద్వానీ తన అయోధ్య ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్టు సమాచారం. 
 
రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలకు రావాలంటూ అద్వానీ, జోషిని విశ్వహిందూ పరిషత్ గత యేడాది డిసెంబరు నెలలోనే ఆహ్వానించింది. కానీ, ఆయన అనారోగ్యం కారణంగా హాజరుకాలేక పోయారు. మరోవైపు, ఈ నెలాఖరులోగా బాల రాముడిని అద్వానీ దర్శించుకుంటారని విశ్వహిందూ పరిషత్ నేత ఒకరు మీడియాకు వెల్లడించారు. బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల ఆలయాల్లో వేడుకలు జరుగుతున్నాయని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు. దాదావు 60 దేశాల్లో వీహెచ్‌పీ, హిందూ సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments