Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య కేసులో ట్విస్ట్ : విచారణ నుంచి వైదొలగిన ధర్మాసన జడ్జి

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (12:08 IST)
అయోధ్య కేసులో సరికొత్త ట్విస్ట్. అయోధ్య భూమి కేసు విచారణ నుంచి ధర్మాసనంలోని జడ్జి ఒకరు తప్పుకున్నారు. దీంతో ఈ కేసు విచారణ ఈనెల 29వ తేదీకి వాయిదా పడింది. అలాగే, ఈ భూవివాద కేసును విచారించేందుకు సరికొత్త రాజ్యాంగ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటుచేయనుంది. 
 
ఆరు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అయోధ భూవివాద కేసును విచారించేందుకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏర్పాటైన విషయం తెల్సిందే. ఇందులో చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్‌, జస్టిస్ లలిత్‌లతో పాటు న్యాయమూర్తులు ఎస్ఏ బోదే, ఎన్వీ రమణ, డీవై చంద్రసూడ్‌లు సభ్యులుగా ఉన్నారు. 
 
అయితే, ఈ ధర్మాసనంలో జస్టిస్ లలిత్‌ ఉండటాన్ని సీనియర్ న్యాయవాది ఒకరు అభ్యంతరం తెలిపారు. దీంతో ఈ కేసు విచారణ ధర్మాసనం నుంచి లలిత్ తప్పుకున్నారు. గతంలో ఇదే కేసులో మరొకరి తరపున లలిత్ న్యాయవాదిగా వాదనలు వినిపించడంతో ఇపుడు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా కేసును ఈనెల 29వ తేదీకి వాయిదా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments