సుప్రీంలో 'ఆధార్' రికార్డు బ్రేక్ చేసిన 'అయోధ్య'

Webdunia
బుధవారం, 16 అక్టోబరు 2019 (20:35 IST)
సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ సాగిన కేసుల విషయంలో 'ఆధార్' రికార్డును 'అయోధ్య' బ్రేక్ చేసింది. ఆధార్ వ్యవహారంపై గతంలో 38రోజుల విచారణ సాగింది. అయోధ్య కేసు విచారణ 40 రోజులు సాగింది.

తొలి స్థానంలో ఉన్న 'కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం' కేసులో 68 రోజుల పాటు వాదనలు ఆలకించింది సర్వోన్నత న్యాయస్థానం. దశాబ్దాల నాటి అయోధ్య కేసులో సుప్రీంకోర్టులో నేటితో వాదనలు ముగిశాయి. అభ్యంతరాల సమర్పించేందుకు గడువు ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది.

ఏళ్లనాటి భూవివాదంలో తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నవంబర్ 17న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి పదవీ విరమణ ఉండటం వల్ల ఆ లోపే తీర్పు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ మేరకు నవంబర్ 4 నుంచి 17 మధ్య సుప్రీం తన నిర్ణయం ప్రకటిస్తుందని పలువురు న్యాయవాదులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments