Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మినీ సమరం.. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఎపుడంటే

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2023 (14:03 IST)
దేశంలో వచ్చే యేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందు మినీ సమరంగా భావించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ ఐదు రాష్ట్రాలకు పోలింగ్ తేదీలు వేర్వేరుగా ఉన్నప్పటికీ ఓట్ల లెక్కింపు, ఫలితాలు మాత్రం డిసెంబరు మూడో తేదీన వెల్లడిస్తారు. నవంబరు 7వ తేదీ నుంచి నవంబరు 30వ తేదీ వరకు పోలింగ్ వివిధ దశల్లో నిర్వహిస్తారు. ఆ ప్రకారంగా ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలను పరిశీలిస్తే, 
 
230 సీట్లు కలిగిన మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీతో పాటు 90 సీట్లు కలిగిన మిజోరంకు నవంబరు ఏడో తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. 200 సీట్లున్న రాజస్థాన్ అసెంబ్లీకి నవంబరు 23న, 119 సీట్లున్న తెలంగాణాకు నవంబరు 30వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అయితే, మావోయిస్టు ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌కు మాత్రం రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 90 సీట్లు ఈ రాష్ట్రంలో తొలి దశ పోలింగ్ నవంబర్ 7వ తేదీన రెండో దశ పోలింగ్ నవంబర్ 17వ తేదీన నిర్వహించనున్నారు. ఈ ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు, ఫలితాలు మాత్రం డిసెంబరు మూడో తేదీన వెల్లడిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments