Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్ ధర రూ.200కు చేరుకుంటే.. టూ-వీలర్‌పై ట్రిపుల్ రైడింగ్‌

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (19:06 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అస్సోం బీజేపీ అధ్యక్షుడు భబేష్ కలిత చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర 200 రూపాయలకు చేరుకుంటే టూ-వీలర్‌పై ట్రిపుల్ రైడింగ్‌కు అనుమతించాలని ప్రభుత్వాన్ని సూచిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. 
 
అంతేకాదు.. పెట్రోల్ లీటర్ ధర రూ.200కు చేరుకున్నప్పుడు టూ-వీలర్ వెహికల్ తయారీ సంస్థలు కూడా ముగ్గురు కూర్చునేందుకు వీలుగా వాహనాలను తయారు చేయాలని అస్సోం బీజేపీ చీఫ్ వ్యాఖ్యానించడం కొసమెరుపు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
 
దీంతో.. తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రజలు ముగ్గురు బయటకు వెళ్లాల్సి వస్తే కారుకు బదులుగా బైక్‌పై వెళుతున్నారని చెప్పడమే తన వ్యాఖ్యల ఉద్దేశమని వివరణ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments