Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్

ఠాగూర్
గురువారం, 17 అక్టోబరు 2024 (18:39 IST)
ఇటీవల తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగర శివారు ప్రాంతంలో భాగమతి ఎక్స్‌‍ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. లూప్ లైనులో ఆగివున్న గూడ్సు రైలను 90 కిలోమీటర్ల వేగంతో వచ్చిన భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరూ మృతి చెందలేదు. కానీ, 200 మంది వరకు గాయపడ్డారు. పది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉన్నట్టు రైల్వే శాఖ విచారణ బృందం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ ప్రమాదం నుంచి ఇంకా మరిచిపోకముందే అస్సాంలో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 
 
అస్సాం రాష్ట్రంలోని దిమా హసావో జిల్లాలో అగర్తలా నుంచి ముంబైకి బయల్దేరిన ఈ రైలు ఇంజిన్‌తో పాటు ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. అస్సాంలోని దిబలోంగ్‌ స్టేషన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. గురువారం మధ్యాహ్న 3.55 గంటలకు జరిగింది. రైలు ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. 
 
ఈ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఉండే పవర్‌ కార్‌, ఇంజిన్‌తో పాటు ఎనిమిది కోచ్‌లు పట్టాలు తప్పాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందగానే.. సహాయక బృందాలు చేరుకున్నాయని తెలిపారు. ఈ ఘటనతో లుమ్‌డింగ్ - బాదర్‌పూర్ సింగిల్ - లైన్ హిల్ సెక్షన్‌లో రైళ్ల రాకపోకలు నిలిపివేసినట్లు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అల్లు అర్జున్ ప్రమోషన్స్ మిగతా హీరోల కంటే విభిన్నంగా కనిపిస్తుంటాయి.

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరోయిన్ సమంత (Video)

అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు ... కొత్త చిత్రాలపై అప్‌డేట్స్ వస్తాయా?

మోక్షజ్ఞ కోసం శోభన.. అమ్మగా కనిపించనున్నారట!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

టమోటాలు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments