Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి ఇంటికీ 100 యూనిట్ల ఉచిత విద్యుత్.. : సీఎం అశోక్ గెహ్లాట్

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (16:18 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఇంటికీ వంద యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. అయితే, వంద యూనిట్ల ఉచిత విద్యుత్‌ హామీని మాత్రం జూన్ ఒకటో తేదీ నుంచే అమలు చేస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. 
 
ఈ కొత్త జీవోలో పేర్కొన్న నిబంధనల మేరకు ప్రతినెలా వంద యూనిట్ల విద్యుత్‌ను వినియోగించేవారి బిల్లు జీరో అవుతుంది. వంద యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ ఖర్చు చేసే కుటుంబాలు వంద యూనిట్ల రాయితీని కూడా పొందుతారు. 
 
అంటే 100 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ ఉపయోగించినా వంద యూనిట్ల బిల్లు ఉచితంగానే ఉంటుంది తెలిపారు. కాగా, రాజస్థాన్ రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల శ్లాబ్‌ల వారీ మినహాయింపును మార్చాలని ఉన్నతాధికారులకు సూచన చేసినట్టు గెహ్లాట్ తెలిపారు. దీంతో ప్రతి ఒక్కరికీ 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను బహుమతిగా ఇవ్వనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments