Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసదుద్దీన్ ఓవైసీపై బూటు దాడి : సౌత్ ముంబైలో...

హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై బూటు దాడి జరిగింది. దక్షిణ ముంబైలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఒవైసీపై బూటు విసిరాడు.

Webdunia
బుధవారం, 24 జనవరి 2018 (10:19 IST)
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై బూటు దాడి జరిగింది. దక్షిణ ముంబైలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఒవైసీపై బూటు విసిరాడు. అయితే, అది ఆయనకు తగలకుండా, కొంచెం పక్కనుంచి వెళ్లిపోయింది. ఘటనతో ఏమాత్రం బెదరని ఒవైసీ... ఆ తర్వాత తన ప్రసంగాన్ని యథాతథంగా కొనసాగించారు. ఈ ఘటన రాత్రి 9.45 గంటల సమయంలో చోటు చేసుకుంది. ట్రిపుల్ తలాక్‌పై ఆయన ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది.
 
ట్రిపుల్ తలాక్‌ను సాధారణ ప్రజలు, ముఖ్యంగా ముస్లింలు అంగీకరించడం లేదనే విషయాన్ని అధికారపక్ష నేతలు గుర్తించడం లేదని ఈ సందర్భంగా ఒవైసీ మండిపడ్డారు. వీళ్లంతా అసహనంతో ఉన్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవడం కోసం అవసరమైతే ప్రాణాలను సైతం ఫణంగా పెడతానని చెప్పారు. మహాత్మాగాంధీ, నరేంద్ర దభోల్కర్, గోవిండ్ పన్సారేలను చంపిన హంతకుల భావజాలాన్నే తనపై బూటు దాడి చేసిన వారు కూడా అనుసరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments