Webdunia - Bharat's app for daily news and videos

Install App

టమోటా తోటకు సీసీటీవీ కెమెరాలతో నిఘా

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (16:35 IST)
దేశ వ్యాప్తంగా టమోటాల ధర ఏ విధంగా పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీటికి ఒక్కసారిగా రెక్కలు రావడంతో వినియోగదారులు గగ్గోలు పెట్టారు. గత కొన్ని రోజులుగా టామోటా ధరలపైనే చర్చలు జరుగుతున్నాయి. టమోటా లారీల అదృశ్యం, తోటల్లో చోరీలు జరుగుతుండటంతో ఓ రైతు తనకు అలాంటి పరిస్థితి రాకుండా టమోటా తోటకు ఏకంగా సీసీ కెమెరాలు అమర్చుకున్నాడు. 
 
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌ జిల్లాకు చెందిన శరద్‌ రావత్‌ అనే రైతు టమోటాలను దొంగలు ఎత్తుకెళ్లకుండా పొలానికి రక్షణగా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేశాడు. టమోటాలకు అధిక ధర పలకడంతో పలు చోట్ల దొంగతనాలు జరుగుతున్నాయి. అందుకే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. అందుకు రూ.22 వేలు వెచ్చించినట్లు తెలిపాడు. ప్రస్తుతం మహారాష్ట్రలో టమోటా ధర కేజీ రూ.160 ఉంది.
 
చాలా రోజుల నుంచి దేశంలో టమోటాలు చోరీకి పాల్పడుతున్న విషయంతెలిసిందే. సోమవారం కర్ణాటకలోని కోలారు నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లున్న టమోటా లోడు అదృశ్యమైంది. అందులో సుమారు రూ.21 లక్షల విలువైన టమోటాలు ఉన్నాయి. మరో ఘటనలో జార్ఘండ్‌ కూరగాయల మార్కెట్‌లో 40 కిలోల టమోటాలను దొంగిలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments