Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వలేం : సుప్రీంకోర్టు

ఠాగూర్
బుధవారం, 14 ఆగస్టు 2024 (17:27 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయి తీహార్ జైలులో ఉంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ అంశంపై సీబీఐ ఈ నెల 23వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి కేసు విచారణను 23వ తేదీకి వాయిదా వేశారు. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జలు భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, కేజ్రీవాల్ అనారోగ్య కారణాల దృష్ట్యా పిటిషన్‌ను తక్షణం విచారించాలంటూ ఆయన తరపు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ చేసిన వినతిని అంగీరించింది. ఈ సందర్భంగా అభిషేక్ మాట్లాడుతూ, మనీలాండరింగ్ కింద కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో సీబీఐ అరెస్టు చేసిందని తెలిపారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తుల ధర్మాసనం ఎలాంటి ఉపశమనం ఇవ్వలేమని స్పష్టం చేసింది. 
 
అంతకుముందు ఆగస్టు 5వ తేదీన కేజ్రీవాల్ అరెస్టును ఢిల్లీ హైకోర్టు సమర్థించిన విషయం తెల్సిందే. ఆయన అరెస్టు చట్టబద్ధమైనదేనని తీర్పు చెప్పింది. సీబీఐ కేసులో ట్రయల్ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కేజ్రీవాల్‌కు సూచించింది. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించిన తర్వాతే అరెస్టు జరిగిందని అభిప్రాయపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments