విత్తమంత్రికి సారీ చెప్పిన ఢిల్లీ సీఎం.. ఎందుకు?

కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారీ చెప్పారు. ఈయన ఇప్పటికే మంత్రి నితిన్ గడ్కరీ, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్‌కు కూడా క్షమాపణలు చెప్పారు.

Webdunia
సోమవారం, 2 ఏప్రియల్ 2018 (15:11 IST)
కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారీ చెప్పారు. ఈయన ఇప్పటికే మంత్రి నితిన్ గడ్కరీ, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్‌కు కూడా క్షమాపణలు చెప్పారు. ఆయనతో పాటు.. మరో ముగ్గురు ఆప్ నేతలు కూడా జైట్లీకి సారీ లేఖలు పంపిన వారిలో ఉన్నారు. 
 
తాజాగా ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అరుణ్ జైట్లీ అవినీతికి పాల్పడ్డారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు గుప్పించారు. దీంతో జైట్లీ కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ కోర్టులో సాగుతోంది. ఈ నేపథ్యంలో జైట్లీకి సారీ చెపుడూ కేజ్రీవాల్ ఓ లేఖను రాశారు. 
 
తనపై చేసిన ఆరోపణలను సవాలు చేస్తూ అరుణ్ జైట్లీ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అయితే ఇప్పుడు జైట్లీ తన కేసును వెనక్కి తీసుకునే అవకాశముంది. అలాగే, నితిన్ గడ్కరీ కూడా తాను వేసిన కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
మరోవైపు, కేజ్రీవాల్ వరుస సారీలపై ఆప్ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తొలుత మాట జారడం ఆ తర్వాత సారీలు చెప్పడం ఏమాత్రం సబబుగా లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, బీజేపీ ఎంపీ రమేష్ బిధూరిలకు కూడా ఆయన సారీ చెప్పే అవకాశాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments