Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర.. పసిగట్టిన నిఘా వర్గాలు..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర జరుగుతున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. నిజానికి దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల దేశంలోని

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (13:43 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర జరుగుతున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. నిజానికి దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల దేశంలోని విద్రోహ శక్తుల నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందనీ... అయినా తాను భయపడే ప్రసక్తే లేదని ఇటీవల మోడీ గోవాలో జరిగిన ఓ ర్యాలీలో ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ వార్తలను నిజం చేస్తూ.. ఆయన హత్యకు కుట్ర జరుగుతున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. 
 
ఈ మేరకు మోడీ హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఢిల్లీ పోలీసులకు ఫోన్‌కాల్ వచ్చింది. ఇది కలకలం రేపుతోంది. ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం ప్రకారం... పొలీసులు దీనిపై ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. మోడీకి ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని.. ఇది కేవలం బూటకపు ఫోన్‌కాల్ మాత్రమేనని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయినప్పటికీ పోలీసులు మాత్రం ప్రధానికి ప్రమాదం తీసుకొచ్చే ఏ చిన్నపాటి అవకాశాన్ని కూడా తేలిగ్గా తీసుకోవడం లేదు. 
 
ఈ నేపథ్యంలోనే ఆయన భద్రతకు సంబంధించిన అంశంపై పోలీసులు మరింత సీరియస్‌గా దృష్టిపెట్టారు. మోడీ చంపేందుకు కుట్రజరగుతోందంటూ... దినేష్ కుమార్ అనే వ్యక్తి పేరిట ఉన్న ఫోన్ నుంచి బుధవారం రాత్రి 11:30కి పోలీసులకు కాల్ వచ్చింది. దినేష్ బురారీకి చెందినవాడయినప్పటికీ... ఫోన్ మాత్రం దిల్షాద్ కాలనీ నుంచి వచ్చినట్టు గుర్తించారు. కాల్ లొకేషన్‌కు వెళ్లి విచారించగా.. సదరు షాప్‌లో ఎవరూ కనిపించలేదు. దీంతో దినేష్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments