Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కు పెట్టుకోలేదని.. బూట్లతో జవాన్ కడుపులో తన్నారు.. ఎవరు..?

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (14:03 IST)
భారత సైన్యానికి చెందిన జవాన్‌కు అవమానం జరిగింది. జార్ఖండ్ పోలీసులు జవాన్‌ను చితకబాదారు. జార్ఖండ్ ఛాత్రా జిల్లాలో ఈ ఘటన జరిగింది. మాస్క్ పెట్టుకోలేదని జవాన్‌పై పోలీసులు దాడి చేశారు. బూట్లతో జవాన్ కడుపులో తన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనను భారత ఆర్మీ తీవ్రంగా ఖండించింది. 
 
దీంతో ముగ్గురు పోలీసుల్ని, ఇద్దరు అధికారుల్ని విధుల నుంచి తొలగించారు. ఛాత్రా ఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు. పోలీసులు చితకబాదిన జవాన్‌ను పవన్ కుమార్ యాదవ్‌గా గుర్తించారు. ఛాత్రాలోని కర్మా బజార్ ప్రాంతంలో కొందరు పోలీసులు రౌండప్ చేసి మరీ జవాన్‌ను కొట్టారు.
 
పోలీసులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో .. ఆ రూట్లో బైక్‌పై వచ్చిన జవాన్ యాదవ్‌ను అడ్డుకున్నారు. మాస్క్ లేకపోవడంతో నిలదీశారు. బైక్ తాళాలు లాక్కున్న ఓ పోలీసు చర్య పట్ల ఆర్మీ జవాన్ నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు, జవాన్ల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments