Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన్ ఆర్మీ తొలి చీఫ్ కరియప్పకు భారతరత్న?

భారత ఆర్మీ తొలి చీఫ్, ఫీల్డ్ మార్షల్ కరియప్ప పేరును భారత్ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు సిఫారసు చేశారు. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతరత్నకు కర

Webdunia
ఆదివారం, 5 నవంబరు 2017 (11:38 IST)
భారత ఆర్మీ తొలి చీఫ్, ఫీల్డ్ మార్షల్ కరియప్ప పేరును భారత్ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు సిఫారసు చేశారు. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతరత్నకు కరియప్ప అన్ని విధాలా అర్హులని అన్నారు. 
 
భారతరత్నకు కరియప్ప అనర్హుడు అని చెప్పడానికి మనకు ఒక్క కారణం కూడా కనిపించదన్నారు. ఎందరినో భారతరత్నతో సత్కరించారని... మన దేశ సైన్యానికి దిశానిర్దేశం చేసిన కరియప్పను కూడా ఆ పురస్కారంతో గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. 
 
కర్ణాటకలోని కొడగు జిల్లాలో చదువుకున్న కరియప్ప ఆ తర్వాత సైన్యంలో చేరి ఆర్మీ చీఫ్‌గా ఎదిగారని చెప్పారు. శనివారం కొడగులో పర్యటించిన బిపిన్ రావత్... ఆర్మీ తొలి చీఫ్ కరియప్ప విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన‌పై విధంగా వ్యాఖ్యానించారు.
 
కాగా, 1949లో ఇండియన్ ఆర్మీకి కమాండర్ ఇన్ చీఫ్‌‍గా కరియప్ప నియమితులయ్యారు. 5 స్టార్ ర్యాంకింగ్ సాధించిన ఇద్దరు భారత సైనికాధికారుల్లో కరియప్ప ఒకరు. 1947 ఇండో-పాక్ యుధ్దం, 1965 ఇండో-పాక్ యుద్ధంలో కరియప్ప పాల్గొన్నారు. 1993, మే 15వ తేదీన కన్నుమూశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments