Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేషన్ దుకాణాల్ల త్రివర్ణ పతాకాలు విక్రయమా? సిగ్గు చేటు : రాహుల్ గాంధీ

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (11:45 IST)
దేశంలో 75వ సాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను కేంద్రం ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనుంది. దీన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్క ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఇందుకోసం జాతీయ జెండాలను ప్రతి ఒక్క రేషన్ దుకాణంలో విక్రయించేలా ఒత్తిడి చేస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. 
 
రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను కొనుగోలు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. జాతీయవాదాన్ని భారతీయ జనతా పార్టీ పాలకలు అమ్మకానికి పెట్టిందని, పేదల ఆత్మాభిమానాన్ని గాయపరుస్తోందని ఆయన మండిపడ్డారు. మువ్వన్నెల పతాకం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని, అది అందరి హృదయాల్లో నిలిచి ఉంటుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. 
 
"జాతీయవాదం ఎప్పటికీ అమ్ముడుపోదు. రేషన్ దుకాణాల్లో సరుకులు ఇస్తూ రూ.20తో జాతీయ జెండాను కూడా కొనుగోలు చేయాలని చెప్పడం సిగ్గుచేటు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కొందరు రేషన్ కార్డుదారులు తమను జాతీయ జెండా కొనుగోలు చేయాలని బలవంతం చేస్తున్నారంటూ చెబుతున్న వీడియోను కూడా రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments