Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూత్తుకుడి రక్తసిక్తం.. రేయ్.. ఒక్కడైనా చావాలి.. ఖాకీల కామెంట్స్ (Video)

తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లా రక్తసిక్తమైంది. ఇక్కడ స్థాపించన స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీని మూసివేయాలంటూ పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన మంగవారంతో వంద రోజులు పూర్తి

Webdunia
బుధవారం, 23 మే 2018 (09:52 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లా రక్తసిక్తమైంది. ఇక్కడ స్థాపించిన స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీని మూసివేయాలంటూ పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన మంగళవారంతో వంద రోజులు పూర్తిచేసుకుంది. దీన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అయితే, ఈ ర్యాలీ, నిరసనలు ఉద్ధృతమై ఘర్షణ వాతావరణనానికి దారితీసింది. దీంతో పోలీసు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 11 మంది మరణించారు. ఆపై జరిగిన పరిణామాల్లో మరికొందరు గాయపడ్డారు.
 
కలెక్టరేట్‌ను ధ్వంసం చేశారు. వందలాది సంఖ్యలో వాహనాలకు నిప్పుపెట్టారు. స్టెరిలైట్ ఉద్యోగులు నివశించే భవన సముదాయానికి నిప్పు పెట్టారు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న వేళ.. బయటకు వచ్చిన ఓ వీడియో సంచలనం కలిగిస్తోంది. 
 
ఈ వీడియోలో తుపాకులతో కాల్చాలని కనీసం ఒక్కరన్నా చావాల్సిందేనని ఓ పోలీసు అంటున్న గొంతు వినిపిస్తోంది. 'కనీసం ఒక్కరైనా చనిపోవాల్సిందే' అంటున్న పోలీసు, ఆపై బుల్లెట్ ఫైరింగ్ శబ్దం వినిపిస్తోంది. అయితే, సదరు పోలీసు కాల్చిన బుల్లెట్ కారణంగా ఎవరైనా చనిపోయారా? లేదా? అనే విషయమై స్పష్టతలేదు. ఆ వీడియోను జాతీయ వార్తా సంస్థ 'ఏఎన్ఐ' బయటపెట్టింది. ఆ వీడియోనూ మీరూ చూడండి.

 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments