Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూ కాశ్మీర్‌లో మరో ఎన్‌ కౌంటర్‌

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (20:40 IST)
జమ్మూ కాశ్మీర్‌లో ఆదివారం మరో ఎన్‌ కౌంటర్‌ జరిగింది. భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక జవానుతో పాటు ముగ్గురు ఉగ్రవాదులు మరణించినట్లు అధికారులు తెలిపారు.

శ్రీనగర్‌లోని పాంతా చౌక్‌ వద్ద సిఆర్‌పిఎఫ్‌ దళాలు, పోలీసులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారని, భద్రతా సిబ్బంది కూడా ధీటుగా ఎదుర్కొన్నాయని అన్నారు. గంటలపాటు జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో ఎఎస్‌ఐ బబూరామ్‌ మరణించినట్లు జిల్లా ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా, మూడురోజుల వ్యవధిలో పది మంది ఉగ్రవాదులపై సిఆర్‌పిఎఫ్‌ జవానులు కాల్పులు జరిపారు.

పుల్వామా జిల్లాలోని జాదూరా ప్రాంతంలో జరిగిన ఎన్‌ కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు, సోపియాన్‌ జిల్లాలోని జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే. కాగా, కాశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments