Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్ 4వ తేదీన కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రారంభం

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (20:35 IST)
సెప్టెంబర్ 4వ తేదీన కనకదుర్గ ఫ్లై ఓవర్‌ను ప్రారంభిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. వైసీపీ ప్రభుత్వం విజయవాడ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.

టీడీపీ నేతలైన కేశినేని నాని, బోండా ఉమా ఐదు నెలలకు ఒకసారి బయటకు వస్తారంటూ ఎద్దేవా చేశారు. కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం వారి హయాంలో జరిగితే అప్పుడే ప్రారంభం చేయవచ్చు కదా? అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే ఫ్లై ఓవర్‌ నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు.

కరోనా సంక్షోభ సమయంలో పేద ప్రజల కోసం పని చేయాల్సిన చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటూ జూమ్ సమావేశాలు పెడుతున్నారని విమర్శించారు. 40 ఏళ్ల అనుభవం అంటూ చెప్పుకునే చంద్రబాబు, లోకేష్ చౌదరి హైదరాబాద్‌లో నివాసం ఉండటాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు.

కోవిడ్ సమయంలో సైతం జగన్ మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌పై హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు అనేక కుట్రలు చేస్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments